దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫలితాల విషయంపై దేశం మొత్తం చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. మరొకసారి AAP అధికారం చేపట్టి హ్యాక్రిక్ అందుకుంటుందా లేకపోతే బిజెపి పార్టీ 27 ఏళ్ల తర్వాత ప్రభంజనాన్ని సృష్టిస్తుందా అనే విషయం పైన చాలామంది ప్రజలు కూడా వేచి చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ఈ ఓట్ల లెక్కింపు బీజేపీ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే మెజారిటీ సీట్ల కౌంట్ ను కూడా దాటినట్లు కనిపిస్తోంది. అలాగే AAP పార్టీ అక్కడ గట్టి పోటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.



ఢిల్లీలో మొత్తం మీద 70 స్థానాలకు గాను బిజెపి పార్టీ 45, AAP పార్టీ 24 స్థానాలలో ఆదిత్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ల దేశ చరిత్ర నుంచి ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్కటంటే ఒక్కే స్థానంలో ఆదిత్యంలో ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ కూడా బిజెపికి కానీ, AAP పార్టీకి కానీ పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. లోక్సభ ఎన్నికలలో పుంజుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ కనిపించిన ఆ తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో నామమాత్రంగానే మిగిలిపోయినది.


ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని అసలు పట్టించుకోలేదనే విధంగా ఇక్కడ ఫలితాలను చూస్తూ ఉంటే కనిపిస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలలో ఒకరైన న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన సందీప్ దీక్షిత్ తో పాటుగా మరొకనేత వెనుకంజలోనే ఉంటున్నారట. మరి కాంగ్రెస్ ను ఢిల్లీ ఓటర్లు సైతం ఎందుకు తిరస్కరించారనే విషయం తెలియడం లేదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఢిల్లీలో ఎదురుదె తగులుతోందని చెప్పవచ్చు. మరి ఇక మీదట నైనా సరే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా రాహుల్ గాంధీ ఏవైనా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తారా లేదా అన్న విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: