ఢిల్లీ పీఠంపై బీజేపీ గెలిచిందని చెప్పడం కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ గోర ఓటమి చవిచూసింది .. కాంగ్రెస్ పార్టీ గట్టిగా బుద్ధి చెప్పిందని చెప్పడం ఇక్కడ కరెక్ట్ గా ఉంటుంది .. పార్లమెంట్ ఎన్నికల్లో .. స్పీప్‌ చేసిన బిజెపి అసెంబ్లీకి వచ్చేసరికి కేజ్రీవాల్‌ ముందు ఎప్పుడూ తలవంచాల్సి వచ్చేది .. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు పది సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకతకు తోడు చుట్టూ ముట్టిన అవినీతి ఆరోపణలతో ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయని  తెలిసిన మిత్ర పక్షాన్ని కలుపుకొని పోవటంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారు .. అసలు కాంగ్రెస్ లేకుండా ఇండియా కూటమని ఏర్పాటు చేస్తానని దిమాకు మొదటిలోని మోసం తెచ్చుకున్నారు.


ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపికి వ‌చ్చిన‌ ఓట్లు 47% .. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ఓట్లు 43% కన్నా ఎక్కువ .  అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య తేడా మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్లు మధ్య మాత్రమే ఉంటుంది .. ఇక కాంగ్రెస్ పార్టీకి 7 శాతం ఓట్లు వచ్చాయి. ఢిల్లీ ఎన్నికలకు ముందు వరకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పని చేసింది .. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసారు కానీ అది కలిసి రాలేదు .. ఆ బంధాన్ని ఈ ఎన్నికల్లో కూడా కొనసాగించి ఉంటే ఓట్లు బదిలీ జరిగి ఉండేది కేజ్రీవాల్ , సిసోడియా వంటి వాళ్ళు స్వల్ప తేడాతో  ఓడిపోయేవారు కాదు .. ఈ గోరా ఓటమి నుంచి బయటపడి ఉండేవారు.


ఈ క్ర‌మంలోనే గత రెండు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో కాంగ్రెస్ కు ఒక సీటు కూడా రాలేదు .. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది .  అయితే ఈసారి నాలుగు శాతం ఓట్లు పెంచుకుంది .. ఇప్పుడు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది .. హర్యానాలో కాంగ్రెస్ కూడా ఇదే తప్పు చేసింది . అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుని ఉంటే ఎంతోకొంత మేలు జరిగి ఉండేది కానీ అలా చేయలేదు ఢిల్లీలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఇప్పుడు అదే తప్పు చేసి నిండా మునిగిపోయింది. ఇప్పుడు చేతులు కాల‌క‌ ఆకులు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: