![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycpb530c768-1acd-478b-b7bf-d88041da8ba3-415x250.jpg)
మరి ముఖ్యంగా గుంటూరు పశ్చిమం - పొన్నూరు - ప్రత్తిపాడు - తాడికొండ - మంగళగిరి - వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసిపి బాగా వీక్ అయిపోయింది. అసలు ద్వితీశ్రేణి నాయకులు ఎవరు వైసీపీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. వైసీపీ తరఫున చిన్న చిన్న కార్యక్రమాలు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిగా అక్కడ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2019లో వైసీపీని గెలిపించి తప్పు చేశామన్న భావనకు ప్రజలు వచ్చేసారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు అక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడి ప్రజల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. ఎప్పుడు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి ఇక్కడ వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలు ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తాము వైసీపీని గెలిపించడానికి ఎంత మాత్రం నమ్మకంగా లేవని ఓపెన్ గానే చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసిపి బాగా వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలోను ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి.