చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్ పై జరిగిన దాడి విషయంలో కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ దాడిని  కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  కొనియాడారు.


అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం, బాధాకరం, దురదృష్టకరం అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.


ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి... దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.



సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని విజ్ఞప్తి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేశారు. రంగరాజన్ కి బీజేపీ అన్నిరకాలుగా అండగా నిలబడుతుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  స్పష్టం చేశారు. చిలుకూరు బాలాజి ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటనపై పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా మొత్తం 6గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 7న రంజరాజన్ పై దాడి జరిగగా...8న అయన మోయినాబాద్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలసులు ప్రధాన నిందితుడు వీర్ రాఘ రెడ్డి అరెస్ట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: