
ఈ బాధితురాలు తల్లిదండ్రులు హైదరాబాదులో ఉండడంతో ఈమె తన నానమ్మతో కలిసి పెదంచలలో వన్ టు జీవనాన్ని సాగిస్తూ ఉన్నదట. తన మనవరాలికి సైతం న్యాయం జరగాలి అంటూ ఆ బాధ్యత కుటుంబ సభ్యులను సైతం వెళ్లి నిలదీసిందట. దీంతో పెద్దల సమక్షంలో వరశి భాస్కరరావు రాజీ కుదిరించేందుకు సైతం ప్రయత్నాలు జరిగాయని వార్తలు వినిపించాయి. నేపథ్యంలోనే బాధితురాలు దగ్గరలో ఉండే పోలీసులను సైతం ఆశ్రయించిందట. తమకు జరిగిన ఈ అన్యాయం పైన ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా బాధితురాలు నానమ్మ కూడా మాట్లాడుతూ.. తనకు గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాగా అప్పుడు వైద్యులు తన మనవరాలు గర్భవతి అంటూ తెలిపారని.. ఈ విషయం విన్న తర్వాత తన గుండె పేలినట్టుగా అనిపించిందని.. ఇందుకు కారణం టిడిపి నేత వరశి భాస్కరరావు తన మనవరాలని గర్భవతి చేశారంటు ఆమె ఆరోపణలు చేసింది. తమకు న్యాయం జరగాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీరు.. మరి ఏ మేరకు ఏ విషయం పైన టిడిపి నేత వరిశి భాస్కరరావు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది.