తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలలో వైసీపీ ఒకటనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న వైసీపీకి 2024 ఎన్నికల ఫలితాలు మాత్రం ఒకింత షాకిచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా బలంగా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
అయితే ఈ మధ్య కాలంలో జగన్ పై విమర్శలు వస్తే ఆ విమర్శలకు స్ట్రాంగ్ గా బదులిచ్చే విషయంలో వైసీపీ సోషల్ మీడియా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లైలా సినిమా మూవీ ఈవెంట్ లో వైసీపీ టార్గెట్ గా వచ్చిన విమర్శలకు వైసీపీ సోషల్ మీడియా వింగ్ గట్టిగానే బదులిచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు.
 
విమర్శలు చేస్తే మాత్రం చుక్కలే అనే విధంగా వైసీపీ వ్యవహరిస్తూ ఉండటం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో వైసీపీ ఏపీలో మరింత పుంజుకోవడం పక్కా అని చెప్పవచ్చు. కూటమి నేతలు చేస్తున్న తప్పులను సైతం విమర్శించడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.
 
రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత సక్సెస్ సాధించడానికి వైసీపీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ కు చుక్కలు చూపించే విషయంలో సైతం వైసీపీ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. వైసీపీ తెలివిగా అడుగులు వేస్తుండగా కూటమి సంక్షేమ పథకాల అమలులో విఫలం అవుతుండటం వైసీపీకి ఒక విధంగా ప్లస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: