![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/modid5837e8a-f399-4a90-a8e6-2e9f013523c1-415x250.jpg)
అంతేకాకుండా ట్రంప్ మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. తాము ఇతర దేశాల నుండి రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తామని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ వాణిజ్యం విషయంలో భారత్తో కఠినంగా వ్యవహరించిన ఎదల చైనాతో ఎలా పోరాడగలరు? అని ప్రశ్నించగా.. యూఎస్ ఎలాంటి దేశన్నైనా ఓడించే స్థితిలో ఉందని ట్రంప్ గొప్పలు పోయారు. అయితే ఎవరినీ ఓడించే ఉద్దేశం లేదని కవర్ చేస్తూ మాట్లాడారు. ఇంకా ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ట్రంప్ 'Our journey Together' అనే బుక్ గిఫ్ట్గా అందజేశారు. ఈ బుక్పై ఆయన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్ అని సంతకం చేయడం విశేషం.
అందులో భారత్లో పర్యటించిన ఫోటోలను కొన్నింటిని పొందుపరిచారు. అమెరికా పర్యటనలో భాగంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటుందని, ఈ సందర్భంగా పుతిన్, ట్రంప్ చర్చలు జరపడం ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా మోదీ గ్రేట్ లీడర్ అని ట్రంప్ కొనియాడారు. తరువాత మోదీ మాట్లాడుతూ... మిమ్మల్ని వైట్హౌస్లో చూడటం ఆనందంగా ఉందన్నారు. మీ చారిత్రాత్మక విజయానికి అభినందనలు అని మోడీ తెలిపారు. ముంబై ఉగ్రదాడి నిందితుడిని భారత్కు అప్పగిస్తాం అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించగా మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబై ఉగ్రదాడి (2008) కుట్రదారుల్లో ఒకరైన తహవ్వూర్ హుస్సేన్ను ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గులలో ఒకడని చప్పారు. అతడిని న్యాయ విచారణ కోసం ఇండియాకు పంపడానికి హ్యాపీగా ఉందన్నారు.