ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సరికొత్తగా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టం ని సైతం ఏపీ ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లు ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలియజేస్తోంది ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టం ద్వారానే ప్రజలకు నమోదు చేయించేలా అవకాశాన్ని కల్పించబోతున్నారట. వీటి ద్వారానే డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ సదుపాయాన్ని కూడా తీసుకువస్తోంది. దీని ద్వారానే డాక్యుమెంటరీ రిజిస్ట్రేషన్ ,వివాహ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సేవలను ఉపయోగించుకునేలా వీలు కల్పిస్తున్నారు.


ఈ వ్యవస్థ ద్వారా టోకన్ తీసుకొని సబ్ రిజిస్ట్రేషన్కు సైతం ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ను కూడా జనరేటర్ చేసేలా ఉంటుందట.. అయితే ఈ స్లాట్ బుకింగ్ సేవలు అనేవి ఉచితంగానే అందించబోతున్నట్లు తెలియజేశారు. అయితే ఒకవేళ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టం ని సైతం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకుంటే వంద రూపాయలు చలానాతో పాటు సమయాన్ని మార్చుకొని అవకాశాన్ని 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందట. స్లాట్ బుక్ చేసుకుని ముందు రోజు ఆన్లైన్ లో కూడా డాక్యుమెంట్లను సైతం అప్లోడ్ చేయవలసి ఉంటుందట. అలాగే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఫీజులను కూడా చెల్లించాల్సి ఉంటుందట.

దీని ద్వారా రిజిస్ట్రేషన్ లేదా వివాహ రిజిస్ట్రేషన్ వంటి సేవలను సైతం ఎలాంటి అవకతవకలకు సంబంధించి చర్యలు జరగకుండా ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందట. మరి వీటి వల్ల మధ్యవర్తులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదని కేవలం ఆన్లైన్ ద్వారానే అన్ని విషయాలను తెలుసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ వ్యల్యూ కూడా పెంచడం జరిగింది. మరి ఏ మేరకు ఈ డైనమిక్యూ మేనేజ్మెంట్ సిస్టం పద్ధతి ఏపీ ప్రభుత్వానికి కలిసొస్తుందా చూడాలి మరి. మరి వీటి పైన ఏపీ ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: