![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/balayya29b7ee61-48e0-4dc9-aa0f-b3bc896b7785-415x250.jpg)
బసవతారకం ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని తెలియజేశారు. హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ను తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.... నేడు పీడియాట్రిక్ ఐసీయూ, పీడియాట్రిక్ వార్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. క్యాన్సర్ బాధితులు ధైర్యంగా ఉంటే కచ్చితంగా క్యాన్సర్ నుంచి కోలుకుంటారని పేర్కొన్నారు.
ఆసుపత్రి విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని తుళ్లూరులో మరో ఎనిమిది నెలల సమయంలో ఆస్పత్రిని ప్రారంభించనున్నామని బాలకృష్ణ వెల్లడించారు. దీంతో క్యాన్సర్ బాధితులు సంతోషంలో ఉన్నారు. జై బాలకృష్ణ అనే నినాదాలు ప్రపంచం అంతటా మారుమ్రోగుతున్నాయి. నా అభిమానులకు నాకు విడదీయలేని గొప్ప అనుబంధం ఉందని బాలకృష్ణ అన్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసాడు. నేను ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాను. నేను ఎప్పటికీ కుర్రాడినే. నా వయసు ఎప్పటికీ అయిపోదు అని అన్నారు.
నాకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మా నాన్నగారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలి. ఇది అన్ని తరాల నుంచి వస్తున్న డిమాండ్ అంటూ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇదిలా ఉండగా.... నందమూరి బాలకృష్ణ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తనకు వరుసగా నాలుగు హిట్ సినిమాలు అందించిన సంతోషంలో తనకు రెండు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇస్తున్నానని బాలకృష్ణ వెల్లడించారు. తమన్ నాకు తమ్ముడి లాంటి వారని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.