![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-jagan-09f2da41-6e7a-44ea-96ff-1874ba963caf-415x250.jpg)
అయితే జగన్ మాత్రం తాను వచ్చేది లేదని చేతనైంది చేసుకోండని సవాల్ చేస్తున్నారు . అలాగే అనర్హతా వేటు పడకుండా ఒక ఆప్షన్ ఉంది .. లీవ్ లెటర్ రాసి స్పీకర్ అనుమతి తీసుకోవటం .. స్పీకర్ అనుమతితో సభకు డుమ్మా కొడితే అనర్హతా వేటుపడదు కానీ జగన్ అలా లేఖ రాయటం ఆయన మనస్తత్వానికి విరుద్ధమని వైసిపి వర్గాలే అంటున్నాయి. ఇక బీటెక్ రవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు .. వైసీపీకి బలం ఉన్న గ్రామాల్లో ఏకపక్షంగా ఓట్లు వేసే గ్రామాల్లో కొంతమందిని ఆయన ఆకర్షిస్తున్నారు .. ఎంతకాలం ఒకరికే అధికారం ఇస్తారు మీ గ్రామంలో మీరు పేత్నం చేసే సమయం వచ్చిందని అంటున్నారు .. ఇలా అయినా చాలా గ్రామాల్లో ఏకపక్షంగా ఉండకుండా పార్టీకి సానుభూతిపరుల్ని పెంచుకుంటున్నారు .. అలాగే నీటి సంఘాల ఎన్నికల్లను అందుకు ఉపయోగించుకున్నారు . అన్ని ప్రాంతాల్లో తమ పార్టీ తరఫున ఏకగ్రీవం చేశారు ..
అందులో ఎక్కువగా ఏకపక్ష గ్రామాల్లో వైసీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు .. ఇక బిల్లులు రావాల్సిన వారు ఇప్పటికే బీటెక్ రవికి టచ్ లో కి వెళ్ళిపోయారు. గతంలోల ఇప్పుడు వైసీపీ క్యాడర్ లేదు .. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగా క్యాడర్ కూడా భారీగా చీలిపోయింది .. చాలామందిలో అసంతృప్తి ఉంది .. తమకి ఏమీ చేయలేదని బాధపడుతున్నా వారంతా బీటెక్ రవి వైపు వెళ్ళిపోతున్నారు . మరి కొంతమంది షర్మిల వైపు ఉంటున్నారు .. మరికొంతమంది అవినాష్ రెడ్డితో ఉంటున్నారు .. ఇక జగన్ తరుపున పనులు చూసుకునేది అవినాష్ రెడ్డిని .. పులివెందుల్లో జగన్ కంటూ ప్రత్యేక సైన్యం లేదు .. పైనుంచి వస్తున్న ఒత్తిళ్లకారణంగా అవినాష్ రెడ్డి లైట్ తీసుకుంటే పులివెందుల ఫలితం మారిపోతుంది . అందుకే ఉప ఎన్నికలు వస్తే జగన్ కు అంత ఈజీ కాదన్న చర్చ ఇప్పుడు గట్టిగా నడుస్తుంద.