![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/tdp772119de-1967-4318-a734-a2bab73bae3e-415x250.jpg)
2019 ఎన్నికలలో.. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థైన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఉమా తొలిసారిగా ఓడిపోయారు . కానీ .. ఒకే ఒక ఓటమి ఉమా రాజకీయ జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఎవరు ఊహించలేదు . ఈ ఒక్క ఓటమి దెబ్బతో ఆయనకు గత ఎన్నికల్లో అసలు టిక్కెట్ లేకుండా పోయింది. అంతకంటే అవమానం ఏంటంటే .. తనపై వైసీపీ నుంచి గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ను తెలుగుదేశం పార్టీలో తీసుకుని ఆయనకు టీడీపీ సీటు ఇచ్చారు చంద్రబాబు . ఇది ఉమాకు నిజంగా ఘోర అవమానం లాంటిదే . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా .. ఉమాను ఎవరు పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలోనే ఉమా తాజాగా పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాలలో జరుగుతోంది . తాజాగా నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలలో ఆయన తెరవెనక మంత్రంగం నడిపారని .. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక విషయంలో అధిష్టానం తరుపున విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఒక పేరు ప్రతిపాదించారు . అయితే .. స్థానిక ఎమ్మెల్యే సౌమ్య అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తికి చైర్ పర్సన్ ఇవ్వాలని పట్టుబట్టి తన మాట నెగ్గించుకున్నారు . దీని వెనక ఉమా మంత్రంగం నడిపారని .. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది .