- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నారు. పైగా.. నిరంతరం మీడియాలో కనిపిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కానీ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో కీచులు ఆడుకుంటూనే ఉంటారు. ఇద్దరిపైన కేసులు కూడా ఉన్నాయి. ఆ ఇద్దరు నేతలు ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందినవారు. వారు ఎవరో కాదు.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. ప్రస్తుత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి. వీరి మధ్య మొదట్లో సఖ్యత బాగానే ఉన్న.. తర్వాత రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరించారు. ఏవి సుబ్బారెడ్డి పై.. అఖిలప్రియ తరచుగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.


గతంలో ఆయనపై జరిగిన హత్యాయత్నం కేసులో అఖిలప్రియ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏవి సుబ్బారెడ్డికి ఉన్న సొంత ఇల్లు పై అఖిలప్రియ కన్నేశారు. తన నియోజకవర్గం ఆళ్లగడ్డలు ఏవికి సొంతంగా ఇల్లు ఉంది. దీనిని ఏదో ఒక విధంగా కూలగొట్టాలని.. అఖిలప్రియ రాజకీయ ఉద్దేశం. కానీ.. ఇది ముందుకు సాగటం లేదు. రోడ్డును ఆక్రమించి కట్టారని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏవీ ని నియోజకవర్గంలో ఉండకుండా చేసేందుకు అఖిల ప్రయత్నాలు చేస్తున్నారని.. సుబ్బారెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తరచుగా అఖిల ప్రియ ధర్నాలు, నిరసనలతో సంచల‌నాలకు దిగుతున్నారు.


వాస్తవానికి గత ఎన్నికల్లో అఖిలప్రియ ని ఓడించేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం ఇద్దరి మధ్య వివాదాన్ని మరింత పెంచింది. తాజా విషయానికొస్తే టిడిపి అధిష్టానం ఏమీ చెప్పడం లేదు. చంద్రబాబు సైతం ఎన్నోసార్లు ఈ ఇద్దరి మధ్య రాజీ చేయాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే.. అంతర్గతంగా మాత్రం ఏవీ సుబ్బారెడ్డికి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం. సుబ్బారెడ్డికి పార్టీలోని ముఖ్య నాయకుడు. .. పోలీట్‌ బ్యూరో సభ్యుడుతో వియ్యం ఉండటం.. ఆయనకు, సీఎం చంద్రబాబుకు మధ్య అవినాభావ‌ సంబంధాలు ఉండటం కలిసి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: