ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాల హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు .. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది .. ఈ పథకాల లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 8 నెలలుగా ఈ వీటి కోసం ఎదురుచూస్తున్నారు .. అయితే వాటిలో తల్లికి వందనంగా పేరు మార్చిన అమ్మఒడి పథకం, అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన రైతు భరోసా పథకాలు కీలకంగా ఉన్నాయి .. ఈ రెండు పథకాలు అమలుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సంకేతాలు ఇస్తుంది .. ఇప్పుడు వాటికి కొనసాగింపగా మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో కీలక ప్రకటన జారీ చేశారు ..


ఈరోజు జరిగిన శాసనమండలి సమావేశాలు హాట్ టాపిక్ గా జరిగాయి .. ఈ క్రమంలోనే వైసిపి ఎమ్మెల్సీలు ఈ పథకాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు .. తాము అమలు చేసిన పథకాల‌న్ని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది అంటూ విమర్శలు చేశారు .. అయితే ఈ క్రమంలోని మంత్రి నారా లోకేష్ వారి విమర్శలకు స్పందిస్తూ గట్టి సమాధానం ఇచ్చారు .. అలాగే శాసనమండలి సాక్షిగా సవాల్ చేస్తున్నానంటూ ఏప్రిల్ , మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని కీలక ప్రకటన జారీ చేశారు .. అలాగే ఎన్నికలకు ముందు తామచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న‌మ‌ని కూడా తెలిపారు .


ఇక రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు , పథకాలు అన్ని ప్రారంభమవుతాయని .. ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు .. అలాగే కీలకమైన తల్లికి వందనం , అన్నదాత సుఖీభవ పథకాలు కూడా జూన్ లోపే అమలు చేయాలని నిర్ణయించారు .. అలాగే తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోపే లబ్ధిదారులకు ఇచ్చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .. ఈ క్రమంలోని ఏప్రిల్ , మే నెలలో ఈ రెండు పథకాలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రి లోకేష్ చేసిన ప్రకటన ఇప్పుడు లబ్ధిదారులకు ఆనందాన్ని ఇస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: