
అయితే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యల పైన.. కాంగ్రెస్ మంత్రులు అలాగే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ నోరు తెరిస్తే చాలు పాకిస్తాన్ ఇండియా అంటూ మాట్లాడుతాడని.. మంత్రి సీతక్క కూడా ఆగ్రహించారు. ఓట్లు అడగాలంటే జనాలని ఆడుకోవాలి కానీ... ఇలా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్నట్టుగా గొడవలు సృష్టించకూడదని... చురకలు అంటిస్తున్నారు తెలంగాణ మంత్రులు.
బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ అనడం తప్ప చేసిందేమీ లేదని మండి పడుతున్నారు. ఇది ఇలా ఉండగా.... ఉమ్మడి కరీంనగర్, మెదక్ నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. అలాగే బిజెపి పార్టీ తరఫున అంజిరెడ్డి.. పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాజాగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసేందుకు కరీంనగర్ వెళ్లారు.