ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణల మూడు ప్రాంతాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగగా సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సైతం ఎన్నికలు జరగగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 65.43% గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరిగిందట. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖపట్నం జిల్లాల 87 .30% వరకు ఓటింగ్ జరిగిందట. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ శాతం విషయానికి వస్తే 62% జరిగినట్లుగా తెలియజేస్తున్నారు.


అలాగే తెలంగాణ విషయానికి వస్తే 3 ఎమ్మెల్సీ స్థానాలలో సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు పోలింగ్ అయిన పర్సంటేజ్ విషయానికి వస్తే.. ఉమ్మడి కరీంనగర్ తో పాటుగా మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ వంటి ప్రాంతాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సైతం 40.61 % వరకు జరిగిందట ఇక ఇవే జిల్లాలలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సైతం 63.49 % పోలింగ్ నమోదైనట్లు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ, వరంగల్ వంటి ప్రాంతాలలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 76.35 % వరకు పోలింగ్ నమోదయిందట.ఇక ఈ ఫలితాల సైతం వచ్చే నెల మూడవ తేదీన ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతున్నారు.


అయితే అన్ని చోట్ల కూడా సజావుగానే ఎన్నికలు జరిగినట్లుగా కనిపిస్తోంది. మరి ఎవరు గెలుస్తారు అన్నది వచ్చే నెల మూడవ తేదీన తెలియబోతోంది. అయితే ఈ ఎన్నికలను కూడా చాలా మంది నేతలు ఒక ప్రెస్టేజ్ గానే తీసుకొని మరి చాలా ప్రత్యేకమైన దృష్టిలో పెట్టి మరి గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏపీలో అయితే మరింత ఉత్కంఠంగా ఎన్నికల ఫలితాలు కనపరిచేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: