
2019 ఎన్నికలలో ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసిపి పార్టీలోకి చేరిన ఈయన 2024 లో దర్శి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అందుకోలేకపోయారు. దీంతో కొన్ని కారణాల చేత వైసిపి ఓటమి తర్వాత సిద్ధ రఘురాగవ మళ్ళీ కూటమి వైపు గానే మళ్ళినట్లు ప్రచారం కూడా జరిగింది. విజయవాడలో గత ఏడాది జరిగిన వరదల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి భారీ విరాళాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ మాజీ మంత్రి. దీంతో ఈయన టిడిపి పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
కానీ ఎందుకో అలా మాత్రం జరగలేదు.. సిద్ధ రాఘవుని జనసేన పార్టీలోకి తీసుకునేలా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒంగోలు కార్పొరేషన్ లో జనసేన పార్టీ కైవసం చేసుకున్నారు.ఇప్పుడు సిద్ధ రఘు రాఘవ వంటి వారిని కూడా జనసేన పార్టీలోకి చేర్పించుకోవడంతో తన బలాన్ని సైతం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట మాజీ మంత్రి బాలినేని. దీంతో ఆయనతో పాటుగా మరికొంతమంది జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. జగన్ బంధువుగా ఉన్న బాలినేని జనసేనలోకి చేరడంతో ఆయన తన బలాన్ని చూపించడానికి ఇలా చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.