
అసలు విజయమ్మ కౌంటర్ లాజిక్ ఏంటి, ఎవరినీ కౌంటర్ చేస్తున్నారు, ఎవరి కోసం ఈ వ్యూహం? అనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. చెల్లికి ఆస్తి ఇచ్చి లాక్కున్నాడు, అమ్మకి ఆస్తి ఇచ్చి లాక్కున్నాడు అంటూ జగన్పై విమర్శలు గుప్పిస్తున్న వారికి అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం అంటున్నారు లీగల్ నిపుణులు.
జగన్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా, అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు అమ్మితే బెయిల్ రద్దు అవుతుందనే లీగల్ పాయింట్తో జగన్ ఆడిన మైండ్ గేమ్ ఇది అని కొందరు వాదిస్తున్నారు. షర్మిలకు ఆస్తులు ఇవ్వడం, విజయమ్మ పేరుతో బదిలీ చేయడం వెనుక అసలు మర్మం ఇదేనా? సరస్వతి పవర్ ఆస్తుల వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
కోర్టు అటాచ్మెంట్ను రిలీజ్ చేయగానే విజయమ్మ పేరు మీద ఉన్న ఆస్తులను షర్మిల తిరిగి తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ అటాచ్మెంట్ ఆర్డర్ రావడం.. ఈ మొత్తం వ్యవహారం వెనుక పెద్ద కుట్ర దాగివుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటాచ్ అయిన ఆస్తులను అమ్మితేనే కదా నేరం? మరి అమ్మకుండా, కుటుంబ సభ్యుల మధ్య బదిలీ చేస్తే తప్పేముంది? ఇక్కడే అసలు లాజిక్ మిస్ అవుతున్నారు అంటున్నారు న్యాయ నిపుణులు.
షర్మిల అర్జెంట్ రాజకీయ అవసరాల కోసం ఈ ఆస్తులను తీసుకోవాలని చూసిందా, అందుకే విజయమ్మ పేరుతో ఉన్న ఆస్తులను తన పేరు మీదకు రాయించుకుందా, విజయమ్మ ఎన్.సి.ఎల్.టి కోర్టుకు వెళ్లడం వెనుక అసలు కారణం ఏమిటి? ఇదంతా జగన్ ఆడుతున్న డ్రామానా? లేక నిజంగానే ఆస్తి కోసం కుటుంబంలో చిచ్చు రేగిందా? అనే కోణాల్లోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విజయమ్మ ఎన్.సి.ఎల్.టిలో కేసు వేయడం వెనుక అసలు కారణం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈడి, సిబిఐ కేసులు విచారణకు వచ్చినప్పుడు, జగన్ ఆస్తులు పక్కదారి పట్టించారని వాదిస్తే, అప్పుడు ఈ ఎన్.సి.ఎల్.టి కేసును అస్త్రంగా వాడుకోవచ్చని జగన్ భావించారట. ఆస్తులు తిరిగి ఇవ్వమని కోర్టులో కేసు వేయడం ద్వారా లీగల్ చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని ప్లాన్ చేశారట.
రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పవర్స్పై బ్యాన్ విధించడం, ఆస్తులు లిటిగేషన్స్లో ఉండటం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఆస్తి వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. మరి ఈ విజయమ్మ కౌంటర్ లాజిక్ వెనుక అసలు రహస్యం ఏమిటో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.