మాజీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ కెరీర్ ను ఒకింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. 2029 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తే మాత్రమే తనకు, తన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన ఫీలవుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు 2029లో రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే కూటమి అనుకూల మీడియా మాత్రం వైసీపీపై, జగన్ పై విషం కక్కుతోంది.
 
సెకీకి సంబంధించి అదానీ కుంభకోణంలో జగన్ కు ముడుపులు ముట్టాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం సెకీ జగన్ ప్రభుత్వం పాలనలో ఒప్పందం చేసుకున్న విధంగానే 2 రూపాయల 49 పైసలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జగన్ పరువు నష్టం దావా వేశారు.
 
అయితే కపిల్ సిబాల్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ జగన్ తప్పు చేశారనే విధంగా కామెంట్లు చేయడం ఒకింత సంచలనం అవుతోంది. మరోవైపు జగన్ తరపు లాయర్ మాత్రం తాము కౌంటర్ వేయడానికి కొంతమేర సమయం కావాలని కోరినట్టు సమాచారం అందుతోంది. ఈ కేసు వాదనలు ఏపీ హైకోర్టులోనే జరగాలని కూడా ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ కోరారు.
 
అందువల్ల ఈ కేసులో రాబోయే రోజుల్లో ఊహించని మలుపులు చోటు చేసుకోవడం మాత్రం పక్కా అని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. జగన్ తలచుకుంటే కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టడం కష్టం కాదని అయితే సరైన రీతిలో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: