ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ కు సైతం ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో అత్యంత పర్యాటక ఆదరణ పొందిన రుషికొండ బీచ్ కి సైతం గతంలో బ్లూ ఫ్లాగ్ హోదా కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ ఫ్లాగ్ కోల్పోయిందట.. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ గా పేరుపొందిన రుషి కొండ ఇప్పుడు వాటిని రద్దు చేయడంతో టూరిజం అధికారులు కూడా ఆ జెండాను తొలగించినట్లు తెలుస్తోంది. పర్యటన పరంగా గొప్ప అవకాశం ఉన్న వీటిని తొలగించి ఏపీ పరువు పోయిందంటు చాలామంది ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.


రుషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ బీచ్ బ్లూ ఫ్లాగ్ గా 2020లో గుర్తించడం జరిగింది. డర్మార్కు చెందిన ఫౌండేషన్ ఈ సర్టిఫికెట్ని జారీ చేసింది.. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ కలిగిన బీచ్లకు సైతం భద్రత, శుభ్రత వల్ల గుర్తింపు అందుతుందట.. విదేశీయులు కూడా ఈ పర్యటనలకు ఈ బ్లూ ఫ్లాగ్ తీరాలో వెళ్లేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో రుషికొండ ప్రాంతాన్ని సరిగ్గా పట్టించుకోకుండా గాలికి వదిలేసారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..


ముఖ్యంగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడమే కాకుండా వ్యర్ధాలు కూడా ఎక్కువగా పేరుకుపోవడం నడక మార్గాలు కూడా సరిగ్గా లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయట. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన వాష్రూమ్స్ కూడా చాలా అద్వానమైన పరిస్థితులలో ఉన్నాయని ఫిర్యాదులు కూడా రావడంతో అంతర్జాతీయ పర్యటకులకు సైతం ఆకర్షించే అంతగా అక్కడ ఏవి ఇప్పుడు కనిపించడం లేదట. అందుకే విశాఖ బీచ్ కి సైతం బ్లూ ఫ్లాగ్ తీసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఇలాంటి ప్రత్యేకమైన బీచ్ ల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: