గుంటూరు , కృష్ణాజిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో కూట‌మి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి రౌండ్ లోనే పదివేల ఓట్ల ఆధిక్యం లో ఉన్నారు .. రెండున్నర లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి దాదాపుగా 10 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగబోతుంది .. అయితే మొదటి రౌండ్ లోనే ఆలపాటికి 15 వేలకు వరకు ఓట్లు రాగా .. సమీప అభ్యర్థి ప్రోగ్రెసివ్ డెమెక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కు 7000 ఓట్ల వరకు వచ్చాయి .. ఇందులో 3000 ఓట్లు చెల్లలేదు .. ఆ ఓట్లు పిడిఎఫ్ అభ్యర్థికి కలిపిన 50% ఓట్లు కూటమి అభ్యర్థికి రానున్నాయి ..


అయితే ఇదే హ‌వా మిగిలిన రౌండ్ లో కూడా కొనసాగితే మొదటి ప్రాధాన్యత ఓటుల‌ లోనే ఆలపాటి విజయం కన్ఫామ్ అవుతుంది .. ఒక ఓటు ఎక్కువ వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు రాదు .. మొత్తం పోలైన ఓటల్లో 50 % సాధించాలి .. లేకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లని కూడా లెక్కబెడుతారు .. ఈ సమయంలో ఒక్క రౌండ్లో నే పదివేల ఓట్ల ఆధిక్యం సాధించడం తో  దానిని అధిగమించటం .. పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కు అంత తేలిక కాదన్న వాదన కూడా వినిపిస్తుంది .

 

అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టలేదు .. అయితే ఆ పార్టీ పరోక్షం గా పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కోసం గట్టి గా పని చేసింది .. అయినా గత రెండుసార్లు పిడిఎఫ్ అభ్యర్థి గా గుంటూరు , కృష్ణా జిల్లాల నుంచి లక్ష్మణరావు గెలిచారు .. అయితే ఇప్పుడు ఈసారి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూట‌మీ నుంచి పోటీకి దిగారు .. అప్పటి నుంచి ఆయన ప్రణాళిక బద్ధంగా  పని చేసుకున్నారు .  ఆ ఫలితం ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో గట్టి గా కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: