ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారని విషయం పైన ఉత్కంఠతకు తెరపడినట్టుగా కనిపిస్తోంది. మొదటి ఫలితం తాజాగా వెలుబడినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు విజయాన్ని అందుకున్నారట. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందినట్లు తెలుస్తోంది. శ్రీనివాసులకు బిజెపి పార్టీ మద్దతు ఇవ్వడం జరిగిందట.APTF అభ్యర్థి రఘువర్మ పైన శ్రీనివాసులు విజయాన్ని అందుకున్నారు. మరొక అభ్యర్థి రఘువర్మాకు సైతం టిడిపి జనసేన పార్టీ సపోర్టు ఇచ్చారట.వీరిద్దరి మధ్య హోరాహోరీ గానే పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇద్దరి మధ్య కూడా ఎక్కువగా మెజారిటీ రాలేదట.


అయితే దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను సైతం లెక్కింపు ప్రక్రియలో రఘువర్మ పైన గాద శ్రీనివాసులు ఆదిక్యం సాధించారట. దీంతో శ్రీనివాసులు గెలుపొందినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ బిజెపి పార్టీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులు మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తన ఓటమిని అంగీకరించినటువంటి రఘువర్మ శ్రీనివాసులకు ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయారట. కానీ కూటమిలో భాగంగా బిజెపి ,జనసేన, టిడిపి పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వేరువేరుగా తమ అభ్యర్థులను మద్దతు ప్రకటించుకున్నారు.



 గత నెల 27వ తేదీన జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం మీద 19,813 మంది టీచర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ గాదె శ్రీనివాసులు నాయుడుకు 7210 ఓట్లు వచ్చాయట. పాకాల పాటి రఘువర్మకు సైతం 6845 ఓట్లు సంపాదించుకున్నారట.. అలాగే విజయ గౌరీ 5804 ఓట్లు సంపాదించుకున్నారట. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థులు విజయాన్ని తేల్చలేకపోయాయి. దీంతో రెండవ రౌండ్ ప్రాధాన్యత ఓట్లు సైతం లెక్కింపు చేపట్టారు. ఇందులో గాదె శ్రీనివాసులు నాయుడు విజయాన్ని అందుకున్నారు. మరి దీంతో బిజెపి పార్టీ మద్దతు పెరుగుతోందా ఏపీ అంత అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: