
అయితే ఆయనకు ఎక్కువగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పిడిఎఫ్ అభ్యర్థిని విజయ్ గౌరి నుంచి వచ్చాయి. ఆమెకు పోలైన ఓట్లలో ఎక్కువ మంది ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేసినట్టు తెలుస్తోంది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమికి కారణం అని తెలుస్తోంది. పిడిఎఫ్ తాను గెలవకపోయినా మంచి ఓట్లు తెచ్చుకోవడం తోపాటు గాదె శ్రీనివాసులనాయుడు గెలుపుకు పరోక్షంగా కారణమైంది. శ్రీనివాసులు నాయుడు 2007 నుంచి 13 వరకు ఆరేళ్లపాటు తొలిసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2013 నుంచి 2019 వరకు మరోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి కూడా విజయం సాధించడంతో ఆయన 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. అలాగే మూడుసార్లు గెలిచిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు క్రియేట్ చేశారు. టిడిపి - జనసేన మద్దతుతో బెరిలోకి దిగిన రఘువర్మ కు షాకింగ్ ఫలితం రావడంతో టీచర్లు కూటమి ప్రభుత్వం పట్ల తమ వైఖరి ఏంటో చాటి చెప్పారు.