
గత వైసిపి ప్రభుత్వం లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తం గా ఈ ప్రోగ్రాం ను హల్చల్ చేసింది వైసిపి సర్కార్. అప్పుడు ఈ బాధ్యతలు మొత్తం మాజీ మంత్రి రోజా నిర్వర్తించారు. అయితే ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో... చాలా అవకతవకలు జరిగాయి అన్నది టిడిపి కూటమివాదన.
అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మండలిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని బాంబు పేల్చారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే దీనిపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు ప్రకటన చేయడం.. జరిగింది. ఈ కమిటీ కేవలం 45 రోజుల్లో సభకు నివేదిక అందిస్తుందని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసిపి ప్రభుత్వం దాదాపు 120 కోట్లు ఖర్చు.... చేయడం జరిగిందన్నారు. అందులో స్కాం జరిగిందని టిడిపి వాదన. ఈ డబ్బులు రోజా... తినేసిందని టిడిపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు పై విచారణ జరుపుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు రోజాను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కేసును రోజా ఎలా డీల్ చేస్తుందో చూడాలి.