
తల్లికి వందనం , అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయింపుల్లో భారీగా కోత విధించారని కూడా కళ్యాణి ప్రభుత్వాన్ని తప్పుపట్టారు .. జగన్ ముఖ్యమంత్రి గా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి , రైతు భరోసా ప్రజలకు ఇచ్చే వారిని ఆమె పేర్కొన్నారు .. ఈ బడ్జెట్లో రైతు భరోసాకు కేవలం కంటి తుడుపు చర్యగా నిధులు కేటాయించారని ఆమె విమర్శించారు . అలాగే కూటమి అమలు చేసిన దీపం పథకాన్ని కేవలం 90 లక్షల మందికి కుదించారని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు .. అలాగే సున్నా వడ్డీ కి నిధులు లేవని , ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్ల రూపాయల మాత్రమే ఇచ్చారని ఇవి ఏమాత్రం సరిపోవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు .
అలాగే ఈ బడ్జెట్ అంకెల గరిడీ గానే కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి అభిప్రాయపడ్డారు . అలాగే కుటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే వరకు తాము పోరాడుతామని వైసిపి ఎమ్మెల్సీ కళ్యాణి హెచ్చరించారు .. అలాగే ఈ పథకం పై శాసనమండలిలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ మంగమ్మ తో పాటు కలిసి వాయిదా తీర్మానం ఇచ్చారు .. మండలి చైర్మన్ ఈ తీర్మానాని తిరస్కరించడం తో మీడియా పాయింట్ వద్ద ఆమె కూటమీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు .