ఆంధ్రప్రదేశ్‌లోని డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్  చెప్పింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి మంగళవారం రోజున కీలక ప్రకటన చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారు. దీంతో వెంటనే 16,347 టీచర్ల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. అయితే మెగా డీఎస్సీ కంటే ముందు మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలోనే మరింతమందికి డీఎస్సీ రాసేలా అవకాశం కల్పించేందుకు వీలుగా మరోసారి టెట్ నిర్వహించారు. ఇక, డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి విడుదల చేయనున్న మెగా డీఎస్సీలో.. ఎస్‌జీటీ 6,371 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్స్ 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉన్నాయి.ఈ క్రమంలో డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎవరూ ఊహించని రీతిలో శాసనమండలిలో లోకేష్ ప్రకటన జారీ చేయడంపై డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం చెప్పే ఈ ప్రకటన కోసం ఎందరో అభ్యర్థులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి. ఈ దశలో శాసనమండలి సాక్షిగా లోకేష్ చెప్పిన ఆ ప్రకటన ఏమిటో తెలుసుకుందాం.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసింది.అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూపుల్లో ఉన్నారు. కాగా డీఎస్సీకి సంబంధించి సిలబస్ ను కూడా ప్రభుత్వం విడుదల చేయడంతో అభ్యర్థులు పుస్తకాలు చేతబట్టారు. అంతేకాదు కోచింగ్ ల కోసం కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఎందరో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.

మొత్తం 16 వేలకు పోగా పోస్టుల భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహించి, ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వడమే కాక, బదిలీలు కూడా నిర్వహిస్తామని సీఎం మాటిచ్చారు. అందుకే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రకటన కోసం అభ్యర్థులు వేచి ఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో లోకేష్ శాసనమండలి సాక్షిగా డీఎస్సీ నోటిఫికేషన్ పై కీలక ప్రకటన చేశారు. లోకేష్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదని, 1994 నుంచి 2,60,194 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ చేశామన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని వివరించారు. వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నామని తెలిపారు.మొత్తం మీద ఈ నెలలో నోటిఫికేషన్ కానుందని లోకేష్ ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అటు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పరీక్ష, వెనువెంటనే నియామకాలు ఇస్తున్న నేపథ్యంలో డీఎస్సీ కోసం ఎదురుచూపుల్లో ఉన్న అభ్యర్థుల ఆశలు చిగురించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: