ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని ఆశ వర్కర్లకు ఏజ్ రిలాక్సేషన్ చేస్తూ అలాగే రిటైర్డ్ అయిన తర్వాత డబ్బులను కూడా పెంచుతూ గుడ్ న్యూస్ అయితే కూటమి ప్రభుత్వం తెలియజేసింది. దీంతో ఆశా వర్కర్లు ఆనందపడతారు అనుకున్నప్పటికీ తాజాగా తమ డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుంచి ఛలో విజయవాడకు బయలుదేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆశ వర్కర్లను రైల్వే స్టేషన్లో పోలీసులు సైతం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆశా వర్కర్లు విజయవాడకు వెళ్లకుండా అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారట.


దీంతో నగరంలో రైల్వే స్టేషన్స్, బస్టాండ్ల వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ .. ఛలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారట. అయితే ఇటీ వలె ప్రభుత్వం ఆశా వర్కర్ల వయోపరిమితి రెండేళ్లు పెంపు, మెటర్నటి సెలవులను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసిన ఇవన్నీ కూడా మాకొద్దు కేవలం జీతాలు పెంచండి అంటూ ఆశా వర్కర్లు ఆందోళన చేపడుతున్నారట. దీంతో రైళ్లల్లో బస్సులలో కూడా విజయవాడకు బయలుదేరిన ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో ఉండే వారందరినీ కూడా పోలీసులు వెతికి మరి ఇంటికి పంపిస్తున్నారట.

మరొకవైపు విజయవాడ ధర్నా చౌకలో ఆ శా వర్కర్ల సైతం ఆందోళన చేపడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. సుమారుగా 1700 మంది వరకు ఇక్కడ పాల్గొన్నారట . రిటైర్డ్మెంట్ వయసుకు సంబంధించిన విషయాలను సైతం విడుదల చేయాలని ఆన్లైన్ పనులకు ఇచ్చిన మొబైల్స్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మార్చాలి అంటూ.. అలాగే రికార్డు బుక్కులకు అవసరమయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలంటూ తెలుపుతున్నారట. దీంతో ఒక్కసారిగా ఏపీ అంతట ఉద్రిక్తత నెలకొంది ఆశా వర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులు మరి కనుక్కొని వారిని హెచ్చరిస్తున్నారట. అయితే ఆశ వర్కర్ల విషయంపై సీఎం చంద్రబాబు కు ఇది కట్టి షాక్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: