ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సరికొత్త ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈ పొలిటికల్ హీట్ స్టేట్‌లో మరో అనూహ్య ట్విస్ట్ వెలుగు చూసింది. ఎవరూ ఊహించని విధంగా కమలనాథులు ఎమ్మెల్సీ పీఠం దక్కించుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తూ సీట్లు కొల్లగొడుతున్న బీజేపీ, ఇప్పుడు ఏపీలోనూ తనదైన శైలిలో చక్రం తిప్పింది. టీడీపీ, బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందాలు, మంతనాలు తెర వెనుక నడిచాయా లేక ఇది కేవలం యాదృచ్చికమా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

నిజానికి ఎమ్మెల్సీ స్థానాల పంపకంపై తొలుత టీడీపీ, జనసేన మధ్యనే చర్చలు జరిగాయి. నాలుగు స్థానాలు టీడీపీకి, ఒకటి జనసేనకు అంటూ లెక్కలు తేలాయి. బీజేపీ ఊసే లేదు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. చివరి నిమిషంలో కమలం పార్టీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఐదు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు, ఇంకొకటి బీజేపీకి కేటాయించడంతో అందరూ షాక్ తిన్నారు.

మొన్నటివరకు జనసేనకు మంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా టీడీపీ వాటాలో కోత పెట్టి మరీ తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ ఈ అనూహ్య మార్పు వెనుక అసలు మతలబు ఏంటి? టీడీపీ వ్యూహం బెడిసి కొట్టిందా? లేక బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీకి షాక్ ఇచ్చిందా? ఏది ఏమైనా, ఈ ఎమ్మెల్సీ సీటు బీజేపీకి ఊహించని బహుమతే అని చెప్పొచ్చు. ఇప్పుడు బీజేపీ ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తుందో చూడాలి.

ఇకపోతే బాబు సర్కార్ హయాంలో బీజేపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ సీటు కొట్టేసింది. టీడీపీ, జనసేన సీట్ల పంపకాల్లో కమలనాథులు ఎంట్రీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. టీడీపీ వ్యూహాలకు చెక్ పెట్టి బీజేపీ పై చేయి సాధించిందా, ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: