గత కొంతకాలంగా  కూటమినేతలలో చాలామందికి అసహనం కనిపిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి భవిష్యత్తు తెలిసిపోయిందని.. రాబోయే రోజుల్లో చాలామంది నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి పట్టు ఉన్నటువంటి చేసి కుటుంబ సభ్యులు  జేసీ పవన్ రెడ్డి తన కుటుంబంతో సహా వేరే పార్టీలోకి మారబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. ఈ విషయం పైన అటు జెసి .పవన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది.


పార్టీ మారుతారనే ప్రచారం పైన.. జెసి పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి నిజం లేదని ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోందని.. అంతేకాకుండా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి శైలజ నాథ్ కూడా పార్టీ మార్పు సమయంలో జెసి పవన్ రెడ్డిని కలవడంతో ఇదంతా కూడా నిజమే అనుకున్నారు..కానీ అందులో ఎలాంటి నిజము లేదని.. శైలజనాథ్ వైసీపీలో చేరుతానని నిర్ణయం తీసుకున్నారని.. తాను నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఏమి చేయలేనని కూడా తెలిపారట జెసి పవన్ రెడ్డి.. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాను అంటూ తెలిపారట. అనంతపురం జిల్లాకి సుమారుగా 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని దావోస్ పర్యటనలో భాగంగానే వీటిని కుదర్శగలిగాను అంటూ తెలియజేశారు జెసి పవన్.


మొత్తానికి టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి జెసి కుటుంబం వెళ్తుందని విషయం పైన ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడంతో అటు టిడిపి కార్యకర్తలు నేతలు కొంత మెరకు ఊపిరి పీల్చుకున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారన్న విషయం చూడాలి మరి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రభుత్వ పథకాలు అందించలేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాలా నెగిటివ్ గానే ఉన్నది. మరి ఈ నెగటివ్ ని పోగొట్టడానికి ఏన్నో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: