
అయితే ఈ ముగ్గురు కౌన్సిలర్లు సైతం టిడిపి చేరే సమయంలో వీరిని అభిప్రాయాన్ని కూడా గౌరవించామంటూ తెలిపారు. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వీరు మళ్ళి తిరిగి అదే పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా తెలియజేయడం జరిగింది శివప్రసాద్ రెడ్డి.. మొత్తం మీద పొద్దుటూరుల 41 మున్సిపాలిటీ వార్డులు ఉన్నప్పటికీ ఇందులో 40 స్థానాలను వైసీపీ గెలిచినది కేవలం ఒక్క స్థానంలో టిడిపి విజయాన్ని అందుకోగా అయితే టిడిపి నుంచి గెలిచిన ఆ ఒక్కరు కూడా వైసీపీలోకి రావడంతో అక్కడ టిడిపికి బలం లేకుండానే పోయిందట.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు ఎమ్మెల్యే అయినా వరదరాజుల రెడ్డి వైసీపీ పార్టీ నుంచి 18 మంది కౌన్సిలర్లను టిడిపిలోకి చేర్చుకున్నప్పటికీ మరో ముగ్గురు కౌన్సిలర్లు టిడిపిలోకి చేరితే చైర్మన్ పదవి వస్తుందని భావించిన కానీ ఈ క్రమంలోనే శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. దీంతో తిరిగి మళ్ళీ టిడిపి పార్టీలో చేరిన వారు వైసీపీ పార్టీలోకి వచ్చారు. దీంతో మున్సిపాలిటీ బలం టిడిపికి 15 పడిపోగా.. వైసిపి పార్టీకి 25 కు చేరిందట.