తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా, రాజకీయ నేతగా పేరుపొందిన పోసాని కృష్ణ మురళి గత కొద్ది రోజుల నుంచి పలు రకాల కేసులలో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒక కేసు నుంచి బయటపడేలోపు మరొక కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలోనే పోసాని పైన కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన కేసుని కోర్టు కొట్టు వేసి కొంతమేరకు ఊరట కలిగించిందట. ఈనెల ఆరవ తేదీన JFCM కోర్టులో ఆదోని పోలీసులు సైతం పోసాని కృష్ణమురళిని కస్టడీ పిటిషన్ కి వేశారట.



పోసానని విచారించడానికి ఈ పిటిషన్ దాఖలు చేయగా అయితే ఏడవ తేదీన తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు నిన్నటి రోజున పిటీషన్ ని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. అలాగే బెయిల్ పిటిషన్ పైన కూడా తీర్పు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది.. అలాగే రాయలసీమలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో కూడా పోసానికి బయలు మంజూరు చేయడం జరిగింది. అయితే పోసానికి బెయిల్ ఇవ్వకూడదంటూ పోలీసులు తరఫున న్యాయవాదులు వివరించినప్పటికీ కోర్టు పోసాని తరపున న్యాయవాదుల వాదన విన్న తర్వాత బెయిల్ మంజూరు చేసిందట.


ఈ కేసులో ఫిబ్రవరి 26న పోసాని అరెస్ట్ అవ్వగా హైదరాబాదులో తన సొంత నివాసంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు ఓబుల వారిపల్లికి తీసుకురావడం జరిగింది.. ఆ వెంటనే పల్నాడు జిల్లా నరసరావుపేటలో అలాగే, కర్నూలు జిల్లా ఆదోనిలో మరొక కేసులో నమోదయ్యాయి. దీంతో అక్కడికి కూడా పోసానని తరలించడం జరిగింది. ఈ కేసులో ఉపశమనం కోరుతూ పోసాని క్యాస్ట్ ఫికేషన్ ని వేయగా ప్రస్తుతము అది విచారణలో ఉన్నదట. అయితే పోసానిని కావాలనే ఇలా కేసులో ఇరికించారనే విధంగా కూటమి ప్రభుత్వం మీద వైసిపి నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: