
ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి , బీజేపీ కోసం ఇవ్వటం కారణంగా పార్టీ ప్రతిపక్షంలో ఉండగా త్యాగాలు చేసి పోరాటాలు చేసిన నేతలకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి .. అలాంటివారిలో ప్రధానంగా పిఠాపురం వర్మ , దేవినేని ఉమా లాంటి నాయకులు ఉన్నారు .. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి .. అదేవిధంగా పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు త్యాగం చేసిన ఉమాకు దాదాపు ఇలాంటి హామీయే వచ్చింది . అయితే ఇప్పుడు ఆ ఇద్దరికి కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు .. ఇక దాంతో పిఠాపురం వర్మ తన అసంతృత్యుని బయట పెట్టారని అంటున్నారు .. తన సన్నిహితుల వద్ద పార్టీ కోసం త్యాగాలు చేసి తప్పు చేశామని త్యాగం చేసిన తనకు తగిన బుద్ధి జరిగిందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు .. తర్వాత మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయమే తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారనుకోండి అది వేరే విషయం .. ఇక దేవినేని ఉమ బహిరంగంగానే తన అసంతృతుని బయటపెట్టినప్పటికీ తనకు ఎమ్మెల్సీ అవకాశం రాకపోవటం వల్ల ఆయన నిరాశకు గురైనట్లు టిడిపి వర్గాలే చెబుతున్నాయి ..
అయితే నిజానికి బీజేపీలో ఎమ్మెల్సీ స్థానానికి తగిన నేత లేరని చెప్పాలి .. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి దగ్గరగా ఉన్న సోము వీర్రాజుకు ఇప్పుడు బిజెపి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి అగ్రహానికి తెప్పిస్తున్నాయి .. నిజానికి బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు కారణంగా బిజెపి ఎక్కువ లాభం పొందింది .. ఇదే పరిస్థితి ముందు ముందు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు .. వచ్చే ఐదేళ్ల కాలంలో ఖాళీ అయ్యే ప్రతి పదవి తెలుగుదేశం కూటమికే రాబోతుంది .. అలాగే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి బిజెపి కూడా తగుదునమ్మా అంటూ పదవుల కోసం పోటీకి వస్తుందని అంటున్నారు .. ఇలా మొత్తం మీద కష్టము టిడిపిది తాగాలు ఆ పార్టీవే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందిన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో గట్టిగా కనిపిస్తుంది.