తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన భారత రాష్ట్ర సమితికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా  చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కాంగ్రెస్... పోస్టులు కూడా పెట్టింది. దీంతో... నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్... పార్టీ మారుతున్నారని అందరూ చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తారని.. జోరుగా ప్రచారం జరిగింది.  కానీ చివరి క్షణంలో దాసోజు శ్రవణ్ కు ఛాన్స్ ఇచ్చారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

 
ఇలాంటి నేపథ్యంలో.. నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు చర్చ జరిగింది. అయితే రాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన రాజకీయ భవిష్యత్తుపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.... ఏ వర్గాల ప్రజల కోసం వచ్చాను తనకు తెలుసు అన్నారు. పదవుల కోసం అస్సలు నేను రాలేదని వెల్లడించారు.

 తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా అణిచివేతకు గురైన వర్గాల విముక్తికి.... కెసిఆర్ స్థాపించిన గులాబీ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నా అని ప్రకటించారు.  రేపు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని... అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ముందుకు వెళ్లాలో అనే దానిపైన ఇప్పటినుంచి ఆలోచన చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.


కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తనపై ఫోకస్ చేసి తప్పుడు ప్రచారం చేస్తూ ఉందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే... ఊరుకునేది లేదని మండిపడ్డారు.  కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం హస్తవ్యస్తమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణను మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: