ఎమ్మెల్సీ సీటు తనకు రావటం పై బీజేపీ నాయకుడు సోము వీర్రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు .. 2014 లోనూ తనకు మంత్రి పదవి ఇస్తాను అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ తానే దాని వద్దన్నానని చెప్పుకొచ్చారు . ఇక మాజీ సీఎం జగన్ తో తనుకు రహస్య స్నేహం సంబంధం ఉందంటూ వస్తున్న ఆరోపణ ను ఆయన ఖండించారు .. తనకు జగన్ సీఎం అయ్యే వరకు పరిచయం కూడా లేదని .. ఒకే ఒక్కసారి కౌన్సిల్లో ఆయన కలిసినట్టు ఆయన చెప్పుకోచ్చారు .. ఎమ్మెల్సీ సీటు కోసం తాను ఎలాంటి లాభియింగ్‌ చేయలేదని కూడా సోము వీర్రాజు చెప్పుకొచ్చారు .
 

ఇక నామినేషన్ పాత్రల కోసం స్పెషల్ ఫ్లైట్స్ వాడిటం అనేది పార్టీ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు .. ఇక చంద్రబాబు ను అమరావతిని తాను వ్యతిరేకించా  ని అన్న‌టం అవాస్తమన్నారు .. మోడీ , చంద్రబాబు మధ్య ఎలాంటి బంధం ఉందో తనకు చంద్రబాబు తో కూడా అలాంటి అనుబంధమే ఉందన్నారు .. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడం తో వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు .

 

అయితే 2014 - 19 వరకు ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు .. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు .. ఆ తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి ఆయన స్థానం లో అధ్యక్షురాలిగ హై కమాండ్‌ నియమించింది .. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ   కాబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి నుంచి ముగ్గురి కి జనసేన నుంచి ఒకరికి బిజెపి నుంచి ఒకరికి అవకాశాలు వచ్చాయి . జనసేన నుంచి నాగబాబును అభ్యర్థి గా ప్రకటించగా .. టిడిపి తరఫునకావలి గ్రీష్మ (ఎస్టీ) , బీద రవి చంద్ర(బీసీ) , బీటీ నాయుడు ( బీసీ )  పేర్లను ఆదివారం చంద్రబాబు ప్రకటించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: