జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో భారీగా ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టివెళ్లారు మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చేసరికి విద్యార్థులకు సంబంధించి ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, పిజి ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద విద్యార్థులకు చెల్లించాల్సిన  రూ. 4,271 బకాయిలు పెట్టి వెళ్లారు. జిఓ 77 పేరుతో పిజి ఫీ రీఎంబర్స్ తీసేశారు. దీంతో గ్రా స్ ఎన్రోల్ మెంట్ రేషియో తగ్గడమేగాక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు పడిపోయాయి. ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు సంబంధించి జిఓ 42 తేవడంవల్ల 137 విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ఎయిడెడ్ విద్యావ్యవస్థలో 1097 అధ్యాపకులు రోడ్డునపడ్డారు. ప్రైవేటు వర్సిటీలకు సంబంధించి ఎమెండ్ మెంట్ తెచ్చి జాయింట్ కొలబరేషన్ డిగ్రీ టాప్ -100 ఉండాలని నిబంధన పెట్టారు.  ఈరోజు విట్, ఎస్ఆర్ఎం వంటి ప్రఖ్యాత సంస్థలు ఉత్తమ విద్యాబోధన చేస్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పేటెంట్ ఫైలింగ్స్ ఎపిలో కేవలం 1400 ఉంటే, తమిళనాడులో 7,600 ఉన్నాయి. పిహెచ్ డిలకు వచ్చేసరికి ఎపిలో 5600 మంది విద్యార్థులు ఉంటే, తమిళనాడులో 26వేలమంది ఉన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఉన్నత విద్యలో ఎలా దిగజారామో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు.


ఇంకా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి మన రాష్ట్రంలో పెద్దఎత్తున పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో అడ్మిషన్లు 69శాతానికి అడ్మిషన్లు పడిపోయాయి. ఐటిఐ, పాలిటెక్నిక్ లను ఎన్ సిక్విఎఫ్ అలైన్ మెంట్ లేక విద్యార్థులు తగ్గారు. దాంతోపాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టివెళ్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి క్లస్టర్ మోడల్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. లీప్ మోడల్ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) గైడ్ బుక్ తయారవుతోంది. ప్రభుత్వ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ విద్య, ఐటిఐ, పాలిటెక్నిక్ లు... విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫస్ట్ ఆప్షన్ గా ఉండాలనే లక్ష్యంతో లీప్ మోడల్ తెస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో సీట్లకోసం రికమెండేషన్ లెటర్స్ కావాలని వచ్చే పరిస్థితి తీసుకొస్తాం, వాల్యూబేస్ట్ గ్లోబల్లీ రిలవెంట్ ఎకోసిస్టమ్ ఏర్పాటుచేస్తాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: