జ‌య‌కేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ .. పలు సంచలనాలకు తెరలేపింది .. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి .. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ సార‌థ్యంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూట‌మి ప్రభుత్వ భవిష్యత్ ముక్కు చిత్రం ఎలా ఉండబోతుందని విషయంపై చర్చలు వస్తున్నాయి .. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం ఈ సభ తర్వాత చర్చలు మొదలవుతున్నాయి. ప్రధానంగా ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు దారితీసింది .. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహద పడింది పూర్తిగా జనసేన నాయకులు , అంటూ ఆయన తేల్చి చెప్పటం .. తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మ అంటూ చూరుకులు అంటించడం వంటివి కూటమి పార్టీలో సంచలంగా మారాయి.


అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించే నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేస్తారనేది బహిరంగ రహస్యమే .. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ .. అలాగే పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదులుకున్నారు .. మొదటి జాబితా లోనే ఆయనను శాసనమండలికి పంపిస్తామంటూ చంద్రబాబు  ఆయనకు మంచి హామీ ఇచ్చారు . కానీ కూటమి అధికారులోకి వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మ‌కు  ఎలాంటి అవకాశం దక్కలేదు .   అలాగే ఆయన స్థానాన్ని నాగబాబు తీసుకున్నారని అభిప్రాయం ఇప్పటికే రాజకీయాల్లో వినిపిస్తుంది .. ఇక దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో పరోక్షంగా వర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయటంపై మరింత హాట్ టాపిక్ గా మారాయి.


ఇక జనసేన ఆవిర్భావ సభ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది .. అటు ఎన్టీఆర్ ఇటు తెలుగుదేశం పార్టీ ఉమ్మ‌డి అభిమానులు దీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .. మనకు కావాల్సింది కల్తీ నాయకులు కాదు నిజాయితీగల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావాలి పార్టీకి కష్టమొస్తే కాపాడుకునే యోధులు కావాలి అంటూ ఎన్టీఆర్ ఆ వీడియోలో మాట్లాడారు .. ఇక జనసేన సభ తర్వాత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వైరల్ చేస్తున్నారనేది తెలియటం లేదు .. కానీ టిడిపి జూనియర్ ఎన్టీఆర్ ఉమ్మ‌డి ఫాన్స్ మాత్రం ఈ వీడియోని మాత్రం ఇప్పుడు తెగ వైరల్ చేసేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: