
రాష్ట్రంలో వాలంటరీలు ఎవరూ లేరని మంత్రి వీరాంజనేయ స్వామి తెలియజేశారు.. గత ఏడాది ఆగస్టు వరకే వాలంటరీ సేవలు కొనసాగించారని గత ప్రభుత్వం వారిని కొనసాగించ లేదంటూ కూడా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీలు విధులలో లేనందువలన వారిని కొనసాగించలేమంటూ తేల్చి చెప్పారు. వైసిపి హయాంలో 2.50 లక్షల మంది వాలంటరీలను తీసుకోవడం జరిగింది వీరికి నెలకు 5000 రూపాయలు గౌరవ వేతనం కింద ఇచ్చారు.
వీరితో సంక్షేమ పథకాల దరఖాస్తులకు అలాగే పించిని పంపిణీ వంటివి చేయించేవారు. ఇవాళ వ్యవస్థ పైన అప్పట్లో తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు కూటమినేతలు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా వాలంటరీలను విధులలోకి తీసుకోకూడదంటూ ఎలక్షన్ కమిషనర్ కు సైతం ఫిర్యాదులు చేశారు.. ఆ సమయంలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వాలంటీలకు పదివేలు ఇస్తానని చెప్పి.. ఇప్పుడు చేతులెత్తేశారు మొత్తానికి ఏపీలో వాలంటరీ వ్యవస్థ శకం ముగిసినట్టే ముగిసినట్టుగా కనిపిస్తోంది అయితే దీంతో వాలంటరీల సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి