ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సైతం ప్రమోట్ చేస్తూ చాలామంది సినీ సెలబ్రిటీలు గతంలో ప్రమోట్ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని అరికట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలకు కూడా సపోర్టు చేస్తూ ఉన్నారు. ఇటీవలే కాలంలో అటు యూట్యూబర్స్ , సోషల్ మీడియా పాపులారిటీ సంపాదించిన వారందరు  ఇలాంటివి ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని నోటీసులు పంపించి మరి విచారణ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాలలో అటు హీరోలు ,హీరోయిన్స్ కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగిందట వాటి గురించి కూడా విచారిస్తున్నారు. ఇందులో దగ్గుబాటి రానా పేరు కూడా వినిపించింది తాజాగా ఆయన మీద వచ్చిన ఈ కేసు పైన రాణా పిఆర్ టీమ్ స్పందించింది.



బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ కు రానా ప్రచారం పైన వివరణ ఇస్తూ.. నైపుణ్యం ఆధారిత గేములకు బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే రానా వ్యవహరించారని ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు తర్వాత దీని గడువు 2017లో ముగిసింది. ఆన్లైన్ గేమ్లను చట్టబద్ధంగా అనుమతి పొందిన వాటికే రానా ఆమోదం తెలిపారని తెలిపారు.. అంతేకాకుండా ఒప్పందం చేసుకునే ముందు కూడా రానా న్యాయ బృందం కూడా అన్ని భాగాలను చాలా క్షుణ్ణంగానే పరిశీలించిన తరువాతే అన్ని అనుకూలంగా ఉండేలా ప్లాట్ఫామ్ నే  అంగీకరించారని తెలిపారు.


అందుకు సంబంధించి రానా టీమ్ ఒక ప్రెస్ నోట్ ని కూడా జారీ చేస్తున్నామంటు రిలీజ్ చేశారు. జనానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించినటువంటి ఈ ఆన్లైన్ గేమ్లను హైలైట్ చేయడం చాలా అవసరము.. ఈ గేములు నైపుణ్యం మీదే ఆధారపడి ఉంటాయని అందువల్లే చట్టబద్ధంగా కూడా కోర్టు అనుమతి ఇచ్చిందంటూ రానా టీమ్ క్లారిటీ ఇచ్చింది.. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో 25 మంది సినీ ప్రముఖుల పేర్ల పై కేసులు నమోదు కావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: