చాలా ప్రాంతాలలో పురుషులు వివాహం కాకుండా ఇప్పటికీ చాలామంది జీవిస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంది. ఆంధ్రాలో ప్రతి 1,000 మంది మగవారికి  ఇదివరకు 920 మంది మాత్రమే ఆడపిల్లలు ఉండేవారట.. వివాహాల లెక్క లేకపోతే ఏదైనా ఈక్వేషన్ లెక్క చూసుకుంటే ఇంతమంది ఉండేవారట.. అయితే ఇప్పుడు తాజాగా ఆడపిల్లల సంఖ్య 944కి సైతం పెరిగిందట. 2014 నుంచి 2015 .. ప్రస్తుతం 2023-24 వరకు చూసుకుంటే అంటే సుమారుగా తొమ్మిదేళ్లలో ఈ మార్పు జరిగిందట.


920 నుంచి 944 కి పెరగడం జరిగింది.. దేశవ్యాప్తంగా 2023-24 కీ చూసుకున్నట్లు అయితే ప్రతి 1,000 మంది పురుషులకు సైతం అమ్మాయిలు 930 మంది మాత్రమే ఉన్నారట దీనితో పోల్చుకుంటే..ఆంధ్రప్రదేశ్ కొంతమేరకు ఎక్కువ అని చెప్పవచ్చు..2014- 15 లో ఈ సంఖ్య 918 ఉండగా.. 930 ఇండియా ది ఉండగా అది కూడా పెరిగిందట.. అయితే ఇది కేంద్ర సిరీస్ సంక్షేమ శాఖ చెబుతున్నటువంటి లెక్క ప్రకారం తెలియజేశారు.. అయితే ఇదివరకు అమ్మాయిలు భ్రూణ హత్యలు చేసే దశ నుండి పూర్తిగా మార్పు రాకపోయినప్పటికీ.. కొంత మార్పు కనిపిస్తోంది



పుట్టగానే ఆడపిల్ల అని తెలిసి చంపేసిన సంఘటనలు చాలానే మనం చూస్తూనే ఉన్నాము.. కడుపులో ఉండగానే చంపేసిన సంఘటనలు కూడా చాలానే మనం విన్నాము. ఇప్పుడు వాటన్నిటితో పోల్చుకుంటే ఇది కొంతమేరకు మార్పు అని కూడా చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరింత మార్పులతో ఆడ మగ సమానం అనేటట్టుగా సమాజం మారిపోయేలా కనిపిస్తోంది ఇప్పుడు అబ్బాయిల కు దీటుగా అమ్మాయిలే అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అటు విద్య, ఉద్యోగం, రాజకీయాలలో అన్నిచోట్ల కూడా అమ్మాయిలు అబ్బాయిలతో ఈక్వల్ గానే పోటీ పడుతూ ఉన్నారు. ఈ మార్పు రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళుతుందని పలువురు నివేదికలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: