
ఇప్పటికే... తెలంగాణ రాష్ట్రంలో 1171 బార్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ మహా నగరాలలో ఉండటం గమనార్హం. మైక్రోబువరీల సంఖ్య ను పెంచే అవకాశాలు ఉన్నట్టు కూడా చెబుతున్నారు.
ముఖ్యంగా మున్సిపాలిటీ నగరాలలో ఈ 71 బార్లను విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉత్తర తెలంగాణ వైపు మాత్రమే ఎక్కువ బార్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అదే కాకుండా మొన్న బీర్లపై ధరలు పెంచిన రేవంత్ రెడ్డి సర్కార్... త్వరలోనే లిక్కర్ పైన కూడా 20 నుంచి 30 రూపాయలు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.తెలంగాణ బీర్లపై... ధరలు పెంచడంతో ఇప్పటికే విపరీతంగా ఆదాయం అర్ధిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు లిక్కర్ పై కూడా ధరలు పెంచి... డబ్బులు వసూలు చేయాలని చూస్తోంది. తెలంగాణ ఆదాయం ఈ మధ్యకాలంలో భారీగా తగ్గిపోయిన నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్.