ఆంధ్రప్రదేశ్లో ఏకంగా ఒకే గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు మొదలవ్వడంతో బలభద్రపురం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతోంది.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఉండేటువంటి బలభద్రపురం గ్రామంలో ఒక్కసారిగా క్యాన్సర్ కేసులు ఏపీ అంతట కలకలని సృష్టిస్తున్నాయి.. ఈ గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డట్టుగా అనుమానంతో అధికారులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారట.. ముఖ్యంగా ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలి అని అసెంబ్లీలో కూడా ఇటివలే స్థానిక ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారట.


దీంతో ఒక్కసారిగా తూర్పుగోదావరి జిల్లా వైద్య అధికారులు గ్రామంలో 31 బృందాలతో ఇంటింటా సర్వేలు జరిపించి మరి గ్రామస్తులకు పరీక్షలు కూడా నిర్వహించారట.. బలభద్రపురం గ్రామంలో సుమారుగా పదివేల వరకు జనాభా ఉంటుందని.. ఇందులో ఇప్పటికే 23 మంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లుగా అక్కడ జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు.. అయితే అక్కడ వాతావరణం, కాలుష్యం, నీరు గాలి అన్నీ కూడా కలుషితం కావడం చేతే గ్రామస్తులకు అక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.


బలభద్రపురం గ్రామానికి సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీ తో పాటుగా ఇతర పరిశ్రమల కారణం చేత అక్కడ నీరు గాలి అన్ని కూడా కలుషితమవుతున్నాయని దీని వల్లే చాలామంది క్యాన్సర్ బారిన పడ్డట్టుగా తెలియజేస్తున్నారు గ్రామస్తులు. దీంతో మరి కొంతమంది ఆ క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవాలని ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ అక్కడ స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. ఏడాదికాలంగా ఆ ఊరిలో క్యాన్సర్ తో మరణిస్తున్న వారే సుమారుగా 15 మంది కుటుంబాలు ఉన్నాయని వారిని పరామర్శించడానికి ప్రతిసారి వెళుతున్నానంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అండగా ఉంటుందో చూడాలి.. మరి ఈ విషయం సీఎం దాకా వెళ్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: