దేశంలో ఉండే పెట్రోల్ ధరల కంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉండడం ఏపీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది.. గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలు మన రాష్ట్రంలోని ఇంత ధరలు పెట్రోల్ అధికంగా ఉండడానికి కారణం వైయస్ జగన్ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికలలో ప్రజాల్లో వ్యతిరేకతను పెంచడానికి ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వీరు ఎన్నో రకంగా ప్రచారాలు అయితే చేయడం జరిగింది. కానీ మరి ఇప్పుడు పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాప్పటికీ వీటి పైన ఏవిధంగా కూడా స్పందించలేదు కూటమి ప్రభుత్వం.



దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలని ఒకసారి పరిశీలిస్తే..

1)ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 109.40 పైసలు ఉన్నది.
2).తెలంగాణలో 107.67 పైసలు ఉన్నది.
3). కేరళలో 107.09 పైసలు ఉన్నది.
4). మధ్యప్రదేశ్లో 107.15 పైసలు
5). బీహార్-106.94 పైసలు ఉన్నది.
6). పశ్చిమ బెంగాల్-105.52 పైసలు ఉన్నది.
7). మహారాష్ట్ర-105.37 పైసలు ఉన్నది.
8). రాజస్థాన్-105.14 పైసలు ఉన్నది.
9). కర్ణాటక-103.44 పైసలు ఉన్నది.
10). తమిళనాడు-101.93 పైసలు ఉన్నది.
11). సిక్కిం-101.75 పైసలు ఉన్నది.
12). ఒడిస్సా-101.56 పైసలు ఉన్నది.
13). చతిస్గడ్-101.31.పైసలు ఉన్నది.

దేశంలోని అత్యధిక చౌకంగా పెట్రోల్ దొరికే ప్రాంతం అండమాన్ నికోబార్ 82.46 పైసలతో ఉన్నది.ఇది కేంద్రపాలిత రాష్ట్రం కూడా.. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండడానికి కారణం అటు కూటమి  ప్రభుత్వమే అనుకోవాలా..?  గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణల ప్రకారం అయితే అలాగే అనుకోవలసి ఉంటుంది.. ఎందుకంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ భారాన్ని తగ్గించలేకపోతున్నారు. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులుగా ఉన్న వీరు ప్రశ్నించినప్పటికీ కానీ ప్రస్తుతం వైసీపీ పార్టీ ఈ విషయం పైన ఏవిధంగా ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: