
ప్రజానేతగా.. నెల్లూరు రూరల్ ప్రజలకు ఆపద్బాంధవుడుగా.. కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నుంచి కోటంరెడ్డి ప్రజా సంక్షేమానికి ఎక్కువగా సమయం ఇచ్చేవారు. సొంత వ్యాపారాలు, వ్యవహారాలు ఎన్ని ఉన్నా.. వాటికంటే కూడా తన ప్రజలకు చేరువకావటం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేవారు. ఇలా ఆయన తనను తాను ప్రజలకు అంకితం చేసుకున్నారు. ఇది తర్వాత కాలంలో ఆయనను ప్రజలకు మరింత చేరువ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల కోసం పాదయాత్ర చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు గట్టిగా నిధులు తెచ్చుకున్నారు.
అన్ని పార్టీల నాయకులను కలుపుకుపోవడం అభివృద్ధిలో భాగస్వామ్యం చేయుట కూడా కోటంరెడ్డికి చెల్లింది. ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి మించిన స్థాయిలో సేవలు అందించారు. ఆయన పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా అలాగే దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. అది దక్కకపోయినా నియోజకవర్గంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉన్న అన్ని మార్గాలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఏది ఏమైనా కోటంరెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఆయనకు తిరుగులేదు అని మరోసారి ప్రూఫ్ చేసుకున్నారు.