సాధారణంగా అన్ని రాష్ట్రాలలో కూడా మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా కానీ ఒక్క రాష్ట్రంలో మాత్రం మద్యం దుకాణాల యజమానులు అతి తక్కువ ధరకే బై వన్ గెట్ వన్ అనే విధంగా మద్యాన్ని అమ్మేస్తూ ఉన్నారట. అయితే ఇది ఎక్కువగా గోవాలో జరుగుతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు కానీ ఊహించని విధంగా ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలలో మద్యం ప్రియులు పండుగ చేసుకునే వార్త తెలియజేశారు. అక్కడ లిక్కర్ షాపులో యజమానులు ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితంగా ఇస్తూ ఉండడంతో ఎగబడి కొనేస్తూ ఉన్నారు మద్యం ప్రియులు. మరి ఇలాంటి ఆఫర్ అక్కడ ఎందుకు పెట్టారు పూర్తిగా చూద్దాం.



ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో మద్యం దుకాణాలలో ఒక బాటిల్ కొంటె మరొక బాటిల్ ఉచితంగా అందిస్తున్నారట. అందుకు సంబంధించి యజమానులు కూడా బోర్డులు పెడుతూ మద్యం ప్రియులను ఆకర్షించే విధంగా చేస్తున్నారట. దీంతో మద్యం ప్రియులు కూడా దుకాణాల ఎదుట క్యూ కడుతూ ఉన్నారు. దీంతో ప్రైవేటు ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవులు పెట్టి మరి ఈ మద్యం బాటిల్లను తీసుకొని మురిసిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా మద్యం షాపుల వద్ద పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగా ఉంటున్నారట. మద్యం షాపు  యజమానులు ఇలా ఆఫర్ ప్రకటించడానికి ఒక ముఖ్య కారణం ఉన్నదట.. అదేమిటంటే యూపీలో ప్రతి ఏటా కూడా లిక్కర్ పాలసీలో భాగంగా లైసెన్సులను జారీ చేస్తూ ఉంటారు.. అలా ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త లైసెన్సులు పొందేవారు మద్యం దుకాణాలను తీసుకుంటారు.. ఇక పాత వాళ్ళ వద్ద ఉన్నటువంటి స్టాకు మొత్తాన్ని కూడా క్లియర్ చేయవలసి ఉంటుంది కనుక ఆ తర్వాత వారు మద్యం అమ్ముకోవడానికి వీలు ఉండదు.. దీంతో ఏప్రిల్ ఒకటవ తేదీలోగా ఉన్న మద్యం స్టాక్ ను మొత్తం పూర్తిగా అమ్మేసుకోవాల్సి ఉండడంతో ఇలా ఒకటి కొంటే మరొకటి ఉచితం అన్నట్టుగా ఆఫర్లను ప్రకటించారట. ఇది ఈ నెల 30వ తేదీ వరకే ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: