జనసేన అధినేత, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్లీ అడవుల బాట పట్టబోతున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అంకురార్పణ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాల్టి నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే... అడవి తల్లి బాట  కార్యక్రమం నేపథ్యంలో... రెండు రోజులపాటు మళ్లీ అడవి బాట పట్టబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.


ఇందులో భాగంగానే ఇవాళ అలాగే రేపు.. రెండు రోజుల పాటు అరకు పరిసర ప్రాంతాలలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం... అరకు పరిసరాలలో ఉన్న గిరిజన గ్రామాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. రెండు రోజులపాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు పవన్ కళ్యాణ్.

ఇవాళ అలాగే రేపు ఈ పర్యటన కొనసాగంది. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినబోతున్నారు.  గిరిజన గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది... వాళ్లకు ఎలాంటి అవసరాలు కావాలి... ఆసుపత్రి సౌకర్యాలపై కూడా ఈ పర్యటనలో  సమీక్షించబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.  ఈ రెండు రోజులపాటు మొత్తం గిరిజన ప్రాంతాలకు మాత్రమే కేటాయించబోతున్నారు.


ఈ రెండు రోజుల పర్యటన పూర్తయిన తర్వాత... ఉన్నత అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తన అరకు పర్యటనపై సమీక్ష నిర్వహించి... గిరిజన గ్రామాల్లో  ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేదానిపైన చర్చిస్తారు. ఈ సమీక్ష అనంతరం చంద్రబాబుతో ఈ విషయాలపై ప్రస్తావించబోతున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం గిరిజన గ్రామాలకు న్యాయం చేస్తారు. గతంలో కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇలాంటి గిరిజన గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో... గిరిజన గ్రామస్తుల సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేశారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు మరోసారి అరకు జిల్లాల్లో పర్యటించి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: