ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం సత్యవేడు. ఇక్కడ గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి టిడిపిలో చేరి గత ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు కోనేటి ఆదిమూలం. ఆయన గత వైసిపి ప్రభుత్వం లో ఎమ్మెల్యేగా ఉన్నారు .. ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు కూడా కాకుండానే ఆయన ఓ వలపు వలలో చిక్కుకొని పరువు పోగొట్టుకున్నారు. తర్వాత సదర మహిళ కేసును విచిత్ర చేసుకోవడం చంద్రబాబు నుంచి బలమైన వార్నింగ్‌ వెళ్లడంతో ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యారు. ఆయన సైలెంట్ గా ఉన్న ఆయన అక్కడ రాజకీయాలు మాత్రం వేడెక్కిలా చేస్తున్నారు. ఆదిమూలం స్థానంలో హేమలత అనే మాజీ మహిళా ఎమ్మెల్యే అని ఇన్చార్జిగా నియమించాలన్న డిమాండ్లు తెలుగుదేశం పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సత్య వేడు టిడిపి రాజకీయాలు సలసల మండుతున్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్టు రాని మాజీ ఎమ్మెల్యే హేమలత తన అనుచరులను తాజాగా అమరావతి పంపారు. ఎమ్మెల్యే ఆదిమూలం తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆమె వాదిస్తున్నారు .. ఇదే విషయాన్ని ఆమె తన అనుచరుల ద్వారా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టారు.


అయితే స్థానికంగా టిడిపి క్యాడర్లో ఆదిమూలం పై పెద్దగా సానుకూలత కనిపించడం లేదు .. వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలానికి టిడిపి క్యాడర్ పై ప‌ట్టు లేదు .. పైగా ఆయనను వ్యతిరేకిస్తున్న టిడిపి నాయకులు ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే ఆదిమూలం అంట కాగుతున్నారన్న చర్చ సైకిల్ పార్టీలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా హేమలతకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. ఈ విషయం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు ఇతర పార్టీ సీనియర్లు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల నుంచి కూడా ఆదిమూలంపై హేమలత వర్గం ఆగ్రహంతో ఉంది. ఆయన పార్టీలోకి రాకుండా ఉండి ఉంటే టిక్కెట్ తనకే దక్కి ఉండేదని హేమలత వాదన .. కానీ ఆయన ఆ అవకాశాన్ని కొట్టేసారని ఎమ్మెల్యే హేమలత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు అందువచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: