కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన చేసిన పని ఇప్పుడు రకరకాల చర్చలకు ... కొన్ని విమర్శలకు కారణం అవుతోంది. విరూపాక్షి ఏకంగా సీతమ్మ అమ్మవారికి తాళి కట్టారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పై హిందుత్వవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీరాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవో పేతంగా జరుపుకున్నారు. ఈసారి శ్రీరామనవమి పండుగ చాలా బాగా జరిగింది. అయోధ్యలో గత ఏడాది రామ మందిరం నిర్మించడంతో ఈసారి దేశవ్యాప్తంగా సందులు .. వీధులతో పాటు రాముల వారి ఆలయాలు ఎక్కడ ఉన్నా చాలా వైభవోపేతంగా శ్రీరామ నవ‌మి వేడుకలు నిర్వహించారు.


ఈ వేడుకలలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతమ్మ వారికి స్వయంగా ఎమ్మెల్యే విరూపాక్షి తాళి కట్టారు. సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళి ఇచ్చారు. అయితే ఆ తాళిని కళ్ళకు అద్దుకోవాల్సింది పోయి పొరపాటున ఎమ్మెల్యే విరుపాక్షి సీతమ్మవారికి ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు. అయితే ఈ తతంగాన్ని అడ్డుకోకుండా పండితులు కూడా అక్షింతలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీనిపై విమర్శలు రావడంతో ఎమ్మెల్యే కూడా క్షమాపణలు చెప్పారు. ఎమ్మెల్యే విరూపాక్షి పండితులు కట్టమంటే తాను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్టు వివరించారు. దేవుళ్ళపై తనకు ఎంతో భక్తి కలిగి విశ్వాసంతో ఉంటానని కూడా వివరించారు. 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే నిరూపాక్షి.

మరింత సమాచారం తెలుసుకోండి: