
ఇకపోతే, వక్ఫ్ బోర్డు విషయంలో కాంగ్రెస్ పలు రకాలుగా మోడీపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... సాధారణ ముస్లింలు దేశ విభజన కావాలని ఎప్పుడూ కోరలేదు. కానీ కాంగ్రెస్ అధికార వాంఛ వలెనే భారత్ రెండుగా చీలిపోయింది. ఇపుడు వక్ఫ్ బిల్లు విషయంలో కూడా రాజకీయం చేయాలని చూస్తోంది. సమాజం, ముస్లింల మంచి కోసమే బిజెపి ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో సవరణలు చేసిందని.. దేశ ప్రజలు దీనిని గుర్తించాలని అన్నారు.
1947లో భారతదేశ విభజన బ్రిటిష్ ఇండియాను 2 స్వతంత్ర ఆధిపత్య రాష్ట్రాలుగా విభజించింది. ఈ క్రమంలో భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 స్వపరిపాలన దేశాలు 1947 ఆగస్టు 14–15 అర్ధరాత్రి చట్ట బద్ధంగా ఉనికిలోకి వచ్చాయి. ఈ విభజన 12 నుండి 20 మిలియన్ల మందిని మతపరంగా నిరాశ్రయులను చేసినట్టు అయింది. కొత్తగా ఏర్పడిన ఆధిపత్యాలతో అధిక శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది. అదే సమయంలో పెద్ద ఎత్తున హింస జరిగింది. దీనికంతటికీ కారణం ఎవరో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పరిమితుల చట్టం, 1963 వర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా 1923 నాటి ముస్సల్మాన్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేశారు.అయితే, దీని అమలు మరియు ప్రభావం భవిష్యత్తులో చూడాల్సి ఉంది.