ఎన్నికల్లో విజయం సాధించకుండానే జనసేన పార్టీ తొలి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకోబోతుంది .. ఆ మున్సిపాలిటీ మరి ఏదో కాదు నిడదవోలు .. ఒక కౌన్సిలర్ కూడా జనసేన పార్టీకి లేకుండానే ఈ ఘనత సాధించారు .. మంత్రి కందుల దుర్గేష్ వ్యూహంతో ఇది సాధ్యమైంది ..  రాజమండ్రి టికెట్ కోసం ఆశించి చివరికి నిడదవోలు టికెట్ తో సరి పెట్టుకున్న కందుల దుర్గేష్ .. ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు .. అప్పటినుంచి వైసీపీ చేతిలో ఉన్న మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వ్యూహం రెడీ చేశారు .. ఇక మొత్తం 28 కౌన్సిలర్లకు జనసేన పార్టీకి ఒక కౌన్సిలర్ కూడా లేరు గడిచిన ఎన్నికల్లో వైసీపీ 27 స్థానాల్లో విజయం సాధించగా టిడిపి ఒక స్థానంలో గెలిచింది .. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కోసం వైసిపి కౌన్సిలర్లు జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు .


అలాగే అసలు చైర్మన్ , వైస్ చైర్మన్ కూడా జనసేనలో జాయిన్ అయ్యారు .. ప్రత్యేకంగా జనసేన ఖాతాలో మున్సిపాలిటీ ఆడాల్సిన అవసరం లేదు వారి చేరికతోనే జనసేన ఖాతాలోకి మున్సిపాలిటీ వచ్చినట్లు అయింది .. కానీ ఇది ఫిరాయింపు కింద వస్తుంది .. అయితే వైసీపీ లో ఉన్న మిగిలిన కౌన్సిలర్లు ఆ బాధ లేకుండా చేశారు .. వారు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టారు . అలా అవిశ్వాస తీర్మానం పై సంతకం చేసిన వారిలో కొందరు జనసేనలోకి వెళ్లిపోయారు .. ఇక దీంతో ఈ తీర్మానం చర్చ కు రాకుండానే వీగిపోయింది .. ఇక జనసేన పార్టీ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది .. ఇలా జీరో స్థాయి నుంచి నేడు పీఠం అధిష్టించే స్థాయి కి చేరడం సాధారణ విషయం కాదని మంత్రి దుర్గేష్ రాజకీయ వ్యూహం అని కూడా ఆయన అనుచరులు పార్టీ నాయకుల కు మీడియా కు సమాచారం పంపిస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: