
2019లో జగన్ ను అనుకూలంగా ఈవీఎం మెషిన్లను హ్యాకింగ్ చేశారా? లేదా 2014లో ప్రతిపక్ష స్థానం ఆయనకి ఇద్దాంలే అని హ్యాకింగ్ చేశారా.. అలా ఆయనపై కాస్త జాలి చూపించారా..? ఇప్పుడు వచ్చిన 11 సీట్లు అక్కడ కూడా చూపించొచ్చు కదా.. 2014లోనే చూపించింటే పార్టీ కూడా అప్పటికే ముగిసిపోయేది కదా. అదేదో అంటారు కదా మొగ్గలోనే తుంచి అవతల పడేయొచ్చు కదా.. మరి ఎందుకు చేయలేదు.. అంతకుముందు జరిగిన ఉప ఎన్నికలు కూడా ఈవీఎంలతోనే కదా వైసిపి గెలిచింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా.. ఈ కాంగ్రెస్ పార్టీనే కదా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించింది. అలాగే కడపలో పోటీ చేసినప్పుడు.. ఐదు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు కదా.. అప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఏ కదా అధికారంలో ఉన్నది. ఆ సమయంలో విజయమ్మ పులివెందులలో గెలిచారు కదా.. అప్పుడు పోనీలే మన జగనే కదా అని వదిలేసారా.. లేదు కదా ఆయనపై పగ సాధింపులు చేపట్టి జైలు కూడా పంపించారు కదా..
కాబట్టి ఇలాంటివన్నీ మానేసి ఇకపై ఈవీఎంల మీద పడి ఏడ్చకుండా.. ముందు అసలు ప్రజల మనసు ఎలా గెలుచుకోవాలో ఆలోచిస్తే బెటర్ అని ప్రముఖ జర్నలిస్ట్ సాయి తన అభిప్రాయంగా వెల్లడించారు.