
ఒకప్పుడు హిందువులు సంఖ్యాబలంగా ఉన్న కాశ్మీర్, కాలక్రమంలో రాజకీయ కుట్రలకు, వలసలకు వేదికైపోయింది. స్థానికులు నిర్వాసితులుగా మారితే, సరిహద్దులు దాటి వచ్చిన శక్తులు అధికారం చెలాయించాయి. దేశభక్తి నిండిన గొంతులు మూగబోయాయి. చివరికి దేశాన్ని ప్రేమించే పార్టీలు సైతం రాజీ పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల నుండి కాశ్మీర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వేళ, బెంగాల్లోనూ అదే తరహా ప్రమాదం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బెంగాల్లో పరిస్థితులు అదుపు తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొందరు బంగ్లాదేశీయులు మమతా బెనర్జీని తమ కనుసన్నల్లో నడిపించే రోజులు దగ్గర పడ్డాయని భావిస్తున్నారు. భారత పౌరసత్వం ముసుగులో, గుర్తింపు కార్డుల వెనుక దాగున్న వలస శక్తులు బెంగాల్ భవిష్యత్తును శాసిస్తున్నాయని అనిపిస్తోంది. మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చొచ్చుకు వచ్చిన వారు 40 శాతానికి పైగా పెరిగిపోవడం నిజంగా ప్రమాద ఘంటికలే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో హఠాత్తుగా సైన్యాన్ని రంగంలోకి దించితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. బీఎస్ఎఫ్ జవాన్లపై దాడులు జరుగుతున్నా, కాల్పులు జరిపితే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి రావొచ్చు. అలా చేస్తే అంతర్జాతీయంగా ముస్లిం దేశాలు ఏకమవ్వొచ్చు. క్రైస్తవ దేశాలు సైతం భారత్పై విమర్శలు గుప్పించవచ్చు. అప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రపంచం నిందిస్తుందా? దేశంలో ముస్లింలంతా ఒక్కటై మత విద్వేషాలు రెచ్చగొడతారా? ఇవన్నీ ప్రశ్నలే కాదు, జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టే భయానక నిజాలు.
ఈ గందరగోళంలో హిందువులను బెంగాల్ నుంచి తరిమికొట్టే వ్యూహాలు తెర వెనుక నడుస్తున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న ఇది. బెంగాల్లో బీజేపీ పట్టు సాధించడం అంత సులువు కాదు. కశ్మీర్ అనుభవం ఒక హెచ్చరిక. బెంగాల్ భవిష్యత్తు సంక్లిష్టంగా మారింది.